మరో సారి తమిళ స్టార్ హీరో కార్తీతో రకుల్ ప్రీత్సింగ్ జత కట్టనుంది. ఖాకి సినిమాతో వీరిద్దరి మధ్య రొమాన్స్ పండడం, క్రేజీ పెయిర్గా అభిమానులు అలరించడంతో కార్తీ మరోసారి రకుల్కే ఓటేశాడు. ఈ నేపథ్యంలో రాజత్ రవిశంకర్ దర్శకుడిగా మారి కార్తీ 17వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రల్లో ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ నటిస్తుండగా హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనున్న ఈ సినిమాని ప్రిన్స్ ఫిలిమ్స్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్, శివ కార్తికేయన్ సినిమాలోనూ నటిస్తోంది.
Comments
Post a Comment