చార్మి ఇప్పటికీ మోస్ట్ బ్యూటిఫుల్. ఒకప్పుడు టాలీవుడ్లో అగ్రకథానాయికల్లో ఒకరు. శ్రీ ఆంజనేయంలో అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పకపోవడంతో వరుసుగా అవకాశాలు వెల్లువెత్తాయి. మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, రాఖీ, మంత్ర, జ్యోతి లక్ష్మి చిత్రంలో నటించి మెప్పించింది. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. అది కాస్త బ్రేకప్ అయింది కూడా.. రెండు విషయాల్లో మా ప్రేమ విఫలమైందని, వాటిని తలొగ్గి పెళ్లి చేసుకున్నా తాను విడాకులు తీసుకునే పరిస్థితికి వచ్చేదని ఓ ఇంటర్వ్యూలో చార్మీ చెప్పింది.అంతేకాదు ''అతడు మంచివాడు, కానీ నేనే చెడ్డదాన్ని, పెళ్లి తరువాత ఆయన కోసం సమయం కేటాయించలేను. ఇంటి పనులు చూసుకోలేను. అసలు మా రిలేషన్షిప్లోనే స్పష్టత లేకపోయింది, అందుకే విడిపోయాం'' అని చెప్పింది. ఇక తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్లో తాను లేనని.. ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని, అందుకే వారితో ఉండేందుకే ఇష్టపడతానని పేర్కొంది. ప్రస్తుతం ఛార్మి..పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Post a Comment