కొన్ని పూల రెక్కలు..కొన్ని నీటి చుక్కలు...

విలపిస్తున్న ఇండియన్‌ సినిమా 
'శ్రీ' చివరిచూపు కోసం తరలివస్తున్న అభిమానులు, సెలబ్రెటిలు 


అతిలోకసుందరి..వెండితెర దేవత..శ్రీదేవి ఇక లేదు..అన్న మాటను తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఎన్నో చిత్రాలలో తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'శ్రీ' కోట్లాది హృదయాల్లో వేదన మిగిల్చింది. ఇప్పటికీ చెక్కుచెదరని అందాన్ని చూసి బ్రహ్మకు ఈర్ష్య పుట్టిందా? మా శ్రీదేవిని దేవలోకంలోకి తీసుకుపోతారా? అంటూ బరువెక్కిన హృదయాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ దేవకన్యను కడసారి చూసేందుకు అభిమానులు గంటగంటకూ పోటెత్తుతున్నారు. ప్రస్తుతం ఆమె పార్ధివ శరీరం కంట్రీ క్లబ్‌ లోని సెలబ్రేషన్‌ క్లబ్‌ కు తరలించారు. ఇక సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12.30 వరకు శ్రీదేవి పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. భారీ ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు? తమ అభిమాననటికి కడసారి చూసేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఫ్యాన్స్‌. ఇక బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, ఇలా తేడా లేకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా తరలివస్తున్నారు.

Comments