'రేవ్‌'ట్టిన పోలీసులు

పారిపోయిన సీఐ 
కర్నూల్‌ రేవ్‌ పార్టీ సంచలనం రేపింది. లాడ్జీల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలసులు దాడి చేశారు. ఇందులో అమ్మాయిలతోపాటు ప్రముఖులు పట్టుపడడం కలకలం రేపుతోంది. అరెస్ట్‌ అయిన వారిలో ముగ్గురు డ్యాన్సర్లు, నలుగురు ఈవెంట్‌ నిర్వాహకులు, ఎరువుల కంపెనీ డీలర్లు ఉన్నారు. వీరితో పాటు ఓ సీఐ సహా పలువురు వ్యవసాయ అధికారులు ఉన్నట్లు సమాచారం. కర్నూలు నగరంలోని లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రేవ్‌ పార్టీల పేరుతో లాడ్జీలలో యథేచ్ఛగా మద్యం సేవించి మహిళతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు బడాబాబులు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు లాడ్జీలపై ఆదివారం షీ టీమ్స్‌తో కలిసి దాడి చేశారు. దాడిలో పలువు పట్టుబడ్డారు.. కాగా సీఐ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. సీఐ, ¬టల్‌ యాజమాన్యం, ఎరువుల కంపెనీ అధికారులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Comments