ఓలొమ్మో పదికోట్లు ఇచ్చేసినాది



బ్రిటన్‌లో స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం, మహిళా సాధికారిత కోసం 'టైమీస్‌ అప్‌' ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ బ్రిటన్‌ నటి, ఫెమినిస్ట్‌ ఎమ్మా వాట్సన్‌. తాజాగా 'బ్రిటన్‌ జస్టిస్‌ అండ్‌ ఈక్వాలిటీ ఫండ్‌'కు పది కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. లండన్‌, న్యూయార్క్‌ సబ్‌వేలలో ఫెమినిస్టు పుస్తకాలను ఉద్దేశపూర్వకంగా వదిలేసి వచ్చి మొదట వార్తల్లోకి ఎక్కిన ఆమె ఆ తర్వాత 'టైవిూస్‌ అప్‌' ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫెమినిస్ట్‌గా పేర సంపాదించుకున్నారు. కాగా మహిళా సాధికారిత కోసం, పనిచేసే చోట స్త్రీ, పురుషులను సమానంగా చూసే సమన్యాయం కోసం కొనసాగిస్తున్న ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం కావాలన్నదే ఆమె లక్ష్యం. ఈ సందర్భంగా ఆమె 'మహిళలు మహిళలతో, మహిళలు పురుషులతో భుజంభుజం కలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా సమానత్వ నిధికి విరాళాలు విరివిగా అందించాలి' అని పిలుపునిస్తూ? ఓ వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు.

Comments