క్కభారీ ఫ్లాప్తో త్రివిక్రమ్పై ఏదో తెలియని అనుమానం కలుగుతుంది ఎన్టీఆర్ అభిమానులకు. అందుకే సోషల్ మీడియాలో రకరకాలు ఊహాగానాలకు తెరలేచింది. త్రివిక్రమ్పై ఎన్టీయార్ చాలా అసంతృప్తితో ఉన్నాడని రూమర్లు వచ్చాయి. ఒకానొక దశలో కథ మొత్తం మార్చాలని సూచించినట్టుకూడా వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా జూనియర్ తారక్ పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ తన అభిమాన సంఘాలకు చెందిన ముఖ్య నాయకులను తన ఇంట్లో కలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయాల దగ్గర నుంచి సినిమాల వరకు జూనియర్ తన అభిమాన సంఘాల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు టాక్. ఈ సమావేశంలోనే జూనియర్ వ్యూహాత్మకంగా తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్న మూవీ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 'అజ్ఞాతవాసి' పరాజయం తరువాత తాను త్రివిక్రమ్తో మాట్లాడి ఆ సినిమా కథకు సంబంధించిన విషయాలలో అనేక మార్పులు చేర్పులు చేసినట్లుగా వస్తున్న గాసిప్పులు నమ్మవద్దని, ఈ కథ విషయంలో త్రివిక్రమ్కు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు జూనియర్ తన అభిమానులతో చెప్పాడట. ఇదే సందర్భంలో ఈ మూవీ ప్రాజెక్ట్ కోసం తాను తన ఫిజిక్ విషయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేసుకోవడం లేదని, కేవలం కొద్దిగా బరువు తగ్గాలి అన్న ఉద్దేశంతో ఒక డైటీషియన్ సలహాతో తను ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జూనియర్ తన అభిమానులకు వివరించాడు అని తెలుస్తోంది. ఇదే సందర్భంలో జూనియర్ తాను నటించే భవిష్యత్ సినిమాల కథలకు సంబంధించి ఎటువంటి పాత్రలు తాను నటిస్తే బాగుంటుంది అన్న సలహాలను కూడ అడిగినట్లు టాక్. ఇదిలా ఉండగా జూనియర్ త్రివిక్రమ్ల మూవీలో హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేతో పాటు శ్రద్ధా కపూర్ల మధ్య ఫైనల్ రేస్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Nice good message
ReplyDelete