తిరుమలలో రతన్‌టాటా

తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ఆదివారం ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకున్నవ ఇషయం తెలిసిందే. సోమవారం వేకువజామున విజయవాడ ఎంపీ కేశినేని నాని రతన్‌ టాటాతో పాటు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌,టాటా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌ వెంకటరామణన్‌లకు దగ్గరుండి తిరుమలేశ్వరుడి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని రతన్‌ టాటా దత్తత 265, గ్రామాల అభివృద్ధిపై ఎంపీ నానితో సమీక్షించారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Comments