కేంద్ర బడ్జెట్‌ 2018

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ రోజు ఉదయం లోక్‌సభలో 11 గంటలకు బడ్జెట్‌ను ప్రసాంగాన్ని మొదలుపెట్టారు. అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. అయితే ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది. బడ్జెట్‌ ప్రవేశపెట్టే కంటే ముందు పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ 2018-19కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు. 

- నాలుగేళ్ల కిందట పారదర్శకత పాలన అందిస్తామని చెప్పాం. 
- మేం అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది. 
- మోదీ నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయి. 
- ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌. 
- జీఎస్టీతో పేదలకు మేలు జరిగింది. 
- పేద, మధ్యతరగతిలపై వైద్యపరమైన భారం పడకుండా చూసాం. 
- సెంట్ల ధరలు తగ్గించాం. 
- నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేశాం. 
- రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టాం. 
- వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. 
- ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు సంక్షేమ రంగంపై దృష్టి సారించింది. 
- మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. 
- రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాం. 
- భారత్‌ 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. 
- 2020 నాటికి రైతులను ధనికులుగా చేస్తాం.

Comments