ఇప్పటికైతే పిల్లల కోసం సమయం లేదు

ముంబయి: సినిమాలే తనకు పిల్లలతో సమానమని అంటున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. జనవరి 1న విద్యా తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకల గురించి విద్య మీడియాతో మాట్లాడారు. '39 ఏళ్లు వస్తున్న సందర్భంగా ఏదన్నా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం నా స్నేహితులు, నా భర్త కూడా ఏవో ఏర్పాట్లుచేస్తున్నారు.' అన్నారు. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడం విషయంపై విద్య స్పందిస్తూ.. 'ఇప్పటికైతే పిల్లల కోసం సమయం లేదు. నా సినిమాలే నా పిల్లలు. అంటే నా జీవితంలో 20 మంది పిల్లలున్నారు. ఇప్పుడు నా ధ్యాసంతా కేవలం సినిమాలపైనే ఉంది.' అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది విద్య 'బేగం జాన్‌', 'తుమారీ సులు' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'బేగం జాన్‌' బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిపోయింది. కానీ 'తుమారీ సులు' చిత్రం మాత్రం రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

Comments