కిర్రాక్‌ పుట్టిస్తున్న ఫిిదా బ్యూటి

అందంతో కాదు అభినయంతో ఫిదా చేస్తున్న బ్యూటీ సాయి పల్లవి 2018 డైరీలో పేజీలు ఖాళీ లేవు. అటు తమిళంలో, తెలుగులో, మలయాళంలో అమ్మడు ఫుల్‌ బిజీగా ఉండబోతోంది. ఇప్పటికే ప్రధాన బ్యానర్లన్నీ ఈ బ్యూటీ చుట్టూనే కాల్షిట్స్‌ కోసం క్యూ కడుతున్నాయి. 'ఎంసీఏ' చిత్ర్రం మంచి గుర్తింపునివ్వడంతో తెలుగులోనూ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోవైపు తమిళంలో కూడా ఈ అమ్మడుకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో 'కరు' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అంతలోపు సూర్య సరసన నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ధనుష్‌ నటిస్తున్న 'మారి 2' లోను అవకాశాన్ని కొట్టేసింది ఈ తమిళమ్మాయి. అంతేకాకుండా మరో రెండు తమిళ సినిమాల్లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. తనవద్ద కాల్షీట్‌ అడుగుతున్న దర్శకులతో 'కథానాయకుడికి సమానమైన పాత్ర ఉండాలి' అని షరతు పెడుతోందట. నటనకు, డాన్స్‌కు మంచి అవకాశం కూడా ఉండాలని చెబుతోందని సమాచారం. ఏకకాలంలో తెలుగు, తమిళంలో బిజీతారగా మారిపోయింది సాయిపల్లవి. దీంతో అగ్ర హీరోయిన్లతో పాటు.. ప్రస్తుతం ఎదుగుతున్న కథానాయిలు ఆశ్చర్యపోతున్నారు. 
- పి.వేణుగోపాల్‌

Comments