Skip to main content
ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ పరాజయాన్ని మరచిపోయి అభిమానులను అలరించేందుకు కసితో పనిచేస్తున్నారు. కొత్త ఆలోచనలతో..సరికొత్త స్క్రిప్ట్లతో ఫిదా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2017 టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్కు చేదు అనుభవాన్నే మిగిల్చిందని చెప్పుకోవాలి. బ్ర¬్మత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత ఎంతో ఆచితూచి ఎంపిక చేసుకున్న 'స్పైడర్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ సైతం మహేష్ ఫేట్ను మార్చలేకపోయాడు. అయితే అది గతం. ఇక భవిష్యత్ గురించి ఆలోచిస్తే, కొత్త సంవత్సరం మహేష్కు కెరీర్ పరంగా కలిసొస్తుందనే అంచనా లేర్పడ్డాయి. ఎందుకంటే ఒకే ఏడాదిలో మహేష్ నటించే రెండు క్రేజీ సినిమాలు 2018లో రిలీజ్ కానున్నాయి. వీటిలో ఒకటి శ్రీమంతుడు కాంబినేషన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'భరత్ అనే నేను' ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ని ఇచ్చిన జోడీ కావడంతో అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఇదే హుషారులో మహేష్ మరో భారీ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వంశీ పైడిపల్లితో మహేష్ 25వ సినిమా సెట్స్కెళ్లనుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళుతోంది. ఇప్పటికే న్యూయార్క్లో లొకేషన్ల వేట సాగించారని తెలుస్తోంది. అశ్వనీదత్ ? దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే దీపావళికి విడుదల చేయాలన్నది ప్లాన్. ఒకే ఏడాది మహేష్ ఫ్యాన్స్కి డబుల్ ధమాకా షురూ అయ్యింది.
- పి.వేణుగోపాల్
Comments
Post a Comment